మహేశ్వర్ ​రెడ్డికి షాకిచ్చిన కాంగ్రెస్ పార్టీ

by Disha Web Desk 12 |
మహేశ్వర్ ​రెడ్డికి షాకిచ్చిన కాంగ్రెస్ పార్టీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పై కాంగ్రెస్​పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షో కాజ్ నోటీసు‌లు ఇచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నారని, కేవలం గంట లోపు తన వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సూచించింది. దీనిపై మహేశ్వర్​రెడ్డి ప్రెస్​మీట్​పెట్టి వివరాలు ప్రకటిస్తానని గాంధీభవన్​లోని కొందరు ముఖ్యులకు చెప్పినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, గత కొంత కాలంలో మహేశ్వర్​రెడ్డి కాంగ్రెస్​పార్టీ యాక్టివిటీస్​కు దూరంగా ఉంటున్నారు. రేవంత్ వ్యవహరాలు నచ్చక..అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీంతోనే ఇటీవల కాంగ్రెస్​పార్టీ చేసిన ధర్నాలు, నిరసనలు, ఆందోళనల్లో ఎక్కడ పాల్గొనలేదు. రేవంత్ వైఖరి సరిగ్గా లేదని ఢిల్లీ హై కమాండ్​కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని గతంలో మహేశ్వర్​రెడ్డి తన సన్నిహిత వర్గాలకు చెప్పినట్లు తెలిసింది.

బీజేపీలో చేరే అవకాశం..?

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీని మహేశ్వర్ రెడ్డి వీడనున్నట్లు సమాచారం. ఢిల్లీకి వెళ్లి బీజేపీలోకి చేరే అవకాశం ఉన్నట్లు పొలిటికల్​వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ మహేశ్వర్​రెడ్డిపై కాంగ్రెస్​ఎలాంటి రెస్పాన్స్ కాలేదు. కానీ బీజేపీ‌తో టచ్​లో ఉన్నట్లు సమాచారం అందడంతోనే నోటీసులు ఇచ్చినట్లు గాంధీభవన్​లోని ప్రచారం జరుగుతున్నది. ఉత్తమ్ మనిషిగా ఏలేటి కి పేరు ఉన్నది. దీంతో నేరుగా ఉత్తమ్​బుజ్జగించినా ఏలేటి వినలేదని తెలిసింది.

Next Story

Most Viewed